కొండగట్టులో మూడు రోజులుగా జరుగుతున్న చిన్న జయంతి ఉత్సవాలు విజయవంతంగా ఆదివారంతో ముగిశాయి. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చి అంజన్నను దర్శించుకున్నారు. కొండగట్టు అంజన్న మళ్లీ వస్తామంటూ తిరుగు ప్రయాణమయ్యారు. ఈ 3 రోజుల్లో దాదాపు 3 లక్షల మంది భక్తులు క్షేత్రానికి వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.