ఎల్లారెడ్డి ఎంఈవోగా రాజులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన వెంకటేశం గత నెల 31న పదవీ విరమణ చేశారు. గండి మాసానిపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న రాజులును ఇన్ ఛార్జ్ మండల విద్యాధికారిగా రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నియమించారు. ఇన్ ఛార్జ్ ఎంఈఓగా బాధ్యతలు స్వీకరించిన రాజులను ఉపాధ్యాయులు సత్కరించారు.