బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ పట్టణంలోని వైయస్సార్ కాలనీలో గత కొన్ని రోజులుగా నీళ్లు రాకపోవడంతో ఆదివారం కాలనీ ప్రజలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగడానికి నీరు రాకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కాలనీ ప్రజలు కోరారు.