బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపికలో నిజమైన పేదవారికి కాకుండా ఎమ్మెల్యే పోచారం తన అనుచరులకు కార్యకర్తలకు ఇండ్లను కట్టబెట్టారని పార్టీ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.