జగన్ మొసలి కన్నీరు కార్చడానికి వచ్చాడు: మాజీ మంత్రి దేవినేని ఉమా

71பார்த்தது
జగన్ మొసలి కన్నీరు కార్చడానికి వచ్చాడు: మాజీ మంత్రి దేవినేని ఉమా
ఏపీ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఇవాళ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు జగన్ రెడ్డి మొసలి కన్నీరు కార్చడానికి విజయవాడ నగరంలో ఓదార్పు కార్యక్రమం చేశాడని పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వం మీద విషం చిమ్మేందుకు కుట్రలు, కుతంత్రాలతో, నీచపు బుద్ధితో వచ్చాడని విమర్శించారు. గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி