నాచారాం డివిజన్ రాఘవేంద్ర నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫేస్ 3 వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాధుని మొదటి పూజ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు పోతగాని గోపాల్ గౌడ్ దంపతులు స్థానిక కాలనీ వాసులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. వినాయక చవితి పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోతగాని విజయలక్ష్మి, సాయి కిరణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.