మల్లాపూర్ డివిజన్ లో శ్రీ గణేశుని నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా నెమలి అనిల్ కుమార్ ఆదివారం పలు మండపాలను సందర్శించారు. అనంతరం చండీయా నగర్ కాలనీ లోని జై దుర్గ భవాని గణేష్ ఉత్సవ్, అంజి గౌడ్, యువ శక్తి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు.