రైతుల కోసం కాంగ్రెస్ సర్కార్ మరో పథకాన్ని తీసుకురానున్నట్లు గురువారం మంత్రి తుమ్మల తెలిపారు. 'గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం' అనే పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జూన్లో ప్రారంభించనున్నట్లు మంత్రి నాగేశ్వర రావు తెలిపారు. ఈ పథకం ద్వారా సుమారు 40,000 మంది రైతులకు 2500 నుంచి 3000 క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.