లష్కర్ జిల్లా సాధన సమితి అధ్వర్యంలో దీక్ష

68பார்த்தது
తిరుమల లడ్డు పవిత్రతను కాపాడాలని, భక్తులకు కలిగిన అనుమానాలను నివృత్తి చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని నామాల గుండు కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం ఒకరోజు దీక్ష నిర్వహించారు. అద్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన తిరుమల స్వామి వారి లడ్డు తయారీలో అపవిత్రం జరిగిందని ఆరోపణలు రావడం దురదృష్టకరమన్నారు.

தொடர்புடைய செய்தி