మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో ఈడీ సోదాలు

70பார்த்தது
హైదరాబాద్లోని మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో బుధవారం ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ సిటీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రూ. 300 కోట్ల నిధుల గోల్ మాల్ పై ఈడీ కేసు నమోదు చేసింది. నగరంలోని మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రమేష్ కుమార్, ఎండీ పురుషోత్తం దాస్తో పాటు సీఈవో, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.

தொடர்புடைய செய்தி