5 ఎకరాల భూమి కబ్జా, ఎంఐఎం ఎమ్మెల్యే అరెస్ట్

75பார்த்தது
బహదూర్ పురా ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ మూబిన్ ను పోలీసులు ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు భారీగా మోహరించి ఆయనను అరెస్ట్ చేసి రంగారెడ్డి జిల్లా కేశంపేట పీఎస్ కు తరలించారు. శాత్రిపురం కింగ్స్ కాలనీలో 5 ఎకరాల భూమిని కబ్జా చేసి వెంచర్ ఏర్పాటు చేసినట్లు హైడ్రా అధికారులు గుర్తించి వాటిని కూల్చివేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

தொடர்புடைய செய்தி