దొంగతనానికి యత్నించి మృతి

60பார்த்தது
దొంగతనానికి యత్నించిన వ్యక్తి మృతి చెందిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు ప్రకారం, శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పాన్ షాప్ లో దొంగతనానికి యత్నించి డోర్ ను లాగడంతో డబ్బా అతడిపై పడి వ్యక్తి మృతి చెందాడని పోలీసులు పేర్కొన్నారు. వ్యక్తి ఎవరని తెలియరాలేదని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదివారం పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி