టీ20 వరల్డ్ కప్-2024 తొలి మ్యాచ్లో ఐర్లాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూయార్క్లో బుధవారం జరుగుతున్న మ్యాచ్లో భారత్ ఆటగాళ్లు ఐర్లాండ్ను 16 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌట్ చేశారు. ఐర్లాండ్ పై లక్ష్య సాధనకు దిగిన భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐర్లాండ్ నిర్దేశించిన 97 పరుగుల లక్ష్యాన్ని 12.2 ఓవర్ల లో ఛేదించింది. రోహిత్ శర్మ (52), రిషభ్ పంత్ (36) రాణించారు.