మాది చేతల ప్రభుత్వం: మంత్రి పొంగులేటి

55பார்த்தது
మాది చేతల ప్రభుత్వం: మంత్రి పొంగులేటి
విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్‌ మండలం పొన్నెకల్‌లో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల భవనానికి మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. 'గత ప్రభుత్వం స్కూళ్లు పెట్టిందే తప్పా వసతులు కల్పించడంలో విఫలమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రూ.125 నుంచి రూ.150 కోట్లతో అద్భుతంగా స్కూళ్ల నిర్మాణం చేపడతాం. మాటలతో కాదు.. చేతలతో చేసి చూపించే ప్రభుత్వం మాది' అని అన్నారు.

தொடர்புடைய செய்தி