మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. సంజయ్ కిరార్ అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమించాడు. వారిద్దరికీ ఇటీవల గొడవ జరిగింది. అతడి ఫోన్ నంబరును ఆమె బ్లాక్ లిస్ట్లో పెట్టింది. దీంతో ప్రేయసిపై సంజయ్ కోపం పెంచుకున్నాడు. వారు ఉంటున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ప్రేయసి స్కూటర్పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఇతర వాహనాలు సైతం కాలిపోయాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.