ఈనెల 23న సంక్షేమ భవన్ ముందు ధర్నా

73பார்த்தது
ఈనెల 23న సంక్షేమ భవన్ ముందు ధర్నా
హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23న హైదరాబాదులోని సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించనున్నట్లు కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పులిజాల పరుశురాములు తెలిపారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్షేమ హాస్టల్లో సమస్యలను పరిష్కరించాలని, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி