మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించి, పలుఅభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు కలెక్టర్ విజయేందిర తెలిపారు. ఉదయం 8. 45 గంటలకు పిల్లలమర్రి పార్కులో పిల్లలమర్రి ప్రాజెక్టును ప్రారంభిస్తారని, 9. 15 గంటలకు మయూరి ఎకోపార్కు, హిల్ పాయింట్లోని టూరిజం సఫారీని సందర్శిస్తారని పేర్కొన్నారు. 11 గంటలకు కొత్త బస్టాండు 3 స్టార్ హోటల్ పై సమీక్షించి అనంతరం శిల్పారామం సందర్శిస్తారని తెలిపారు.