నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, గురువారం పదరా మండలంలోని బాపన్ పాడు గిరిజన తండాలో మోటార్ సైకిల్ పై వెళ్లి విద్యుత్ నియంత్రికను ( ట్రాన్స్ ఫార్మర్)ప్రారంభించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే విద్యుత్ నియంత్రిక ( ట్రాన్స్ ఫార్మర్) ఏర్పాటు చేయించారు.