పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా లేదని నిండు గర్భిణీ ఆత్మహత్య

68பார்த்தது
పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా లేదని నిండు గర్భిణీ ఆత్మహత్య
పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా లేదని డాక్టర్ చెప్పడంతో మనస్తాపం చెంది గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. గూడూరు మండలం భూపతిపేటకు చెందిన బైరి మమత(29) వివాహమైన 5 ఏళ్లకు గర్భం దాల్చింది. డెలివరీ తేదీ దగ్గర పడటంతో పరీక్షించిన వైద్యులు, పిండం ఎదుగుదల సరిగా లేదని చెప్పారు. సోమవారం పురిటి నొప్పులు రావడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన మమత సమీప చెరువులో బుధవారం శవమై కనిపించింది.

தொடர்புடைய செய்தி