తెలంగాణలో నమోదవుతున్న ఎండల కారణంగా నిర్మల్ జిల్లా కడెం మండలం లక్ష్మీపూర్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు అంటుకుంది. పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడం, అడవిలో చెట్లు, ఆకులు పూర్తిగా ఎండిపోవడం కారణంగా మంటలు అంటుకుని, అడవిలో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కార్చిచ్చుతో పెద్దఎత్తున చెట్లు దగ్ధమయ్యాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మంటలు విస్తరిస్తుండడంతో స్థానికులు వణికిపోతున్నారు.