ఇబ్రహీంపట్నంలో అధికారులపై తిరగబడ్డ వరద బాధితులు

1076பார்த்தது
ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ఏపీలోని విజయవాడ మొత్తం జలమయంగా మారిన విషయం తెలిసిందే. గత ఆరు రోజులుగా ఆహారం కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ - ఇబ్రహీంపట్నం కొండపల్లిలో పోలీసులు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తుండగా.. వరద బాధితులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. వరద బాధితులకు నిత్యవసర సరుకులు అందకపోవడంతో పోలీసులను ప్రశ్నించగా చెయ్యి విరిగిన యువకుడిపై దురుసుగా ప్రవర్తించడంతో ఈ గొడవకు జరిగినట్లు తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி