ఖమ్మంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కారును అడ్డుకున్న వరద బాధితులు (వీడియో)

83பார்த்தது
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం నాడు ఖమ్మం జిల్లా దంసలాపురంలో పర్యటింకారు. ఈ నేపథ్యంలో ఆయన కారుని వరద బాధితులు అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని, కేంద్రం తమను తక్షణమే ఆదుకోవాలని బాధిత మహిళలు కోరారు. ఆయన వెంట వచ్చిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా వారు చుట్టుముట్టి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వర్షాలు, వరదల కారణంగా ఇటీవల ఖమ్మం జిల్లాలోని 100కు పైగా గ్రామాలు నీట మునిగాయి.

தொடர்புடைய செய்தி