దేశవ్యాప్తంగా ప్రశాంతంగా తొలి దశ పోలింగ్ జరుగుతుండగా, మణిపూర్లో మాత్రం హింస చెలరేగింది. ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గంలోని థమన్పోక్పి పోలింగ్ కేంద్రం వద్ద దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లు సమాచారం. కావున తక్షణమే ఆ ప్రాంతంలో భద్రతా చర్యలు పటిష్టం చేయాలని అధికారులను కోరారు. అలాగే ఇంఫాల్ తూర్పు జిల్లాలోని థోంగ్జు అసెంబ్లీ స్థానం పరిధిలోని పోలింగ్ బూత్ కూడా ధ్వంసమైనట్లు సమాచారం.