8 వేల మొక్కలతో కోల్‌కతాలో దుర్గామాత మండపం ఏర్పాటు (వీడియో)

65பார்த்தது
కోల్ కతాలో లాలాబాగన్ నబన్ కూర్ వద్ద దుర్గామాతను పర్యావరణహితంగా రూపొందించారు. మండపంలో ఆహ్లదకరమైన వాతావరణంలో నెలకొల్పిన అమ్మవారి ప్రతిమలను వెదురు, మనీ ప్లాంట్, కూరగాయలు, పలు రకాల పండ్లతో అలంకరించారు. దుర్గామాత ప్రతిమ రూపకల్పనకు ఐదు నెలలు శ్రమించి.. 8వేల మొక్కలను ఉపయోగించామని నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ ప్రాధాన్యతను తెలిపేందుకే ఈ మండపాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు.

தொடர்புடைய செய்தி