ఐపీఎల్ 2024 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ నిష్క్రమించడంతో ఆ జట్టు దిగ్గజ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ చిల్ అవుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో సీఎస్కే 27 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే తన స్వస్థలం రాంచీకి వెళ్లిన ధోనీ సోమవారం తనకిష్టమైన బైక్పై షికారుకు వెళ్లాడు. ధోనీ బైక్ రైడింగ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.