ఐపీఎల్ 2025 భాగంగా సోమవారం విశాఖ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో ఘన విజయం సాధించింది. LSG ఇచ్చిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో ఛేదించింది. DC బ్యాటర్లలో అశుతోష్* (66) అర్థశతకంతో రాణించారు. లక్నో బౌలర్లలో శార్దూల్, బిష్ణోయ్, సిద్ధార్థ్, దిగ్వేష్ తలో రెండు వికెట్లు తీశారు.