తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన కూతురు (వీడియో)

1040பார்த்தது
అనారోగ్యంతో మృతి చెందిన తండ్రికి కూతురు కన్నీటి పర్యంతమై అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన ఏపీలోని గుంటూరులో చోటుచేసుకుంది. గోరంట్లకు చెందిన బాబ్జీ విద్యుత్ శాఖలో ఏడీఈగా పనిచేస్తున్నారు. అనారోగ్యంతో ఈనెల 11న మృతి చెందాడు. బాబ్జీకి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు పెద్ద కూతురు జాహ్నవి తండ్రి అంత్యక్రియలు చేసేందుకు ముందుకొచ్చింది. కన్నీళ్లతో తండ్రి అంత్యక్రియల్లో పాల్గొని చితికి నిప్పంటించింది.

தொடர்புடைய செய்தி