అయోధ్యలో రామమందిరం నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా వేళ అయోధ్యకు భక్తుల తాకిడి పెరిగింది. ప్రయాగ్రాజ్ వచ్చిన భక్తులు రామ్లల్లా దర్శనం కోసం అయోధ్యకు భారీగా తరలివస్తున్నారు. దీంతో అయోధ్యా నగరిలో భక్తుల రద్దీ నెలకుంది. ఈ నేపథ్యంలో రామమందిరం నిర్మాణ పనులు ఆగిపోయినట్లు నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు.