పుణెలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. శౌర్య ఖడ్వే అనే 11 ఏళ్ల బాలుడు రామన్బాగ్ ప్రాంతంలోని న్యూ ఇంగ్లీష్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడుకుంటుండగా అతడి ప్రైవేట్ పార్ట్స్కి బాల్ తగిలింది. దీంతో ఆ బాలుడు కుప్పకూలాడు. ఫ్రెండ్స్ సపర్యలు చేసినా బాలుడు కోలుకోలేదు. బాధిత బాలుడిని హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.