సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆంధ్రా క్రికెట్ సంఘం బంపర్ ఆఫర్ ఇచ్చింది. విశాఖకు తరలివస్తే, పన్ను మినహాయింపులు, ఇతర సహకారం అందిస్తామని తెలిపింది. హెచ్సీఏతో సన్రైజర్స్ వివాదం నేపథ్యంలో ఏసీఏ ఆహ్వానం అందించినట్లు తెలుస్తోంది. ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లను విశాఖలో నిర్వహించాలని ప్రతిపాదించామని ఏసీఏ గురువారం తెలిపింది. సన్రైజర్స్ జట్టు నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొంది.