శ్రీశైలంలో ఇక ఆర్జిత సేవ టికెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే: ఈవో

79பார்த்தது
శ్రీశైలంలో ఇక ఆర్జిత సేవ టికెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే: ఈవో
శ్రీశైలం మల్లన్న భక్తులకు ఆలయ ఈవో శుభవార్త చెప్పారు. ఆర్జిత సేవా టిక్కెట్లు srisailadevasthanam.org వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే నమోదు చేసుకోవాలని ఈవో చంద్రశేఖర్‌ రెడ్డి కోరారు. ఆలయ క్యూలైన్ల వద్ద కేవలం శీఘ్ర , అతిశీఘ్ర దర్శనాల టిక్కెట్లను మాత్రమే ప్రత్యేక కౌంటర్లలో జారీ చేస్తున్నామన్నారు. ఇక, దర్శనార్థం వస్తున్న భక్తులకు ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయాలను దేవస్థానం వారు కల్పిస్తున్నట్టు తెలిపారు.

தொடர்புடைய செய்தி