ఈసారి వేసవికి ముందే ఎండలు మండిపోతున్నాయి. మార్చి 1 నుంచి తెలంగాణలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 35.3 డిగ్రీల నుంచి 38.2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ASF జిల్లా పెంచికల్పేటలో అత్యధికంగా 38.2 డిగ్రీలు, జగిత్యాల (D) బీర్పూర్లో 38.1, నిర్మల్ (D) గింగాపూర్లో 38.1, నాగర్ కర్నూల్ (D) పెద్దముద్నూర్లో 38 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నయోదయ్యాయి.