ఎయిర్ ఇండియా, విస్తారా విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. ఈ విలీనంతో సింగపూర్ ఎయిర్లైన్స్కు ఎయిర్ ఇండియాలో 25.1% వాటా దక్కనుంది. ఈ ప్రక్రియ ఈ ఏడాదిలో పూర్తవుతుందని ఎయిర్ఇండియా అంచనా వేస్తోంది. ఎయిర్ ఇండియా టాటా కంట్రోల్లో ఉండగా, సింగపూర్ ఎయిర్లైన్స్తో సంయుక్తంగా విస్తారాను నిర్వహిస్తోంది. ఈ విలీనంతో ఎయిర్ ఇండియా దేశంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ కేరియర్గా నిలవనుంది.