పునరావాస స్థలాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.. ఎఫ్ ఆర్ ఓ

70பார்த்தது
పునరావాస స్థలాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.. ఎఫ్ ఆర్ ఓ
జన్నారం మండలంలోని మల్యాల గిరిజనులు వెళ్లి నివసించే పునరావస స్థలాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తాళ్లపేట ఎఫ్ఆర్ఓ సుష్మారావు అన్నారు. మల్యాల గిరిజన గ్రామ ప్రజలను వారికి కేటాయించిన పునరావాస స్దలాలైన హాజీపూర్, ముల్కల గ్రామాల మధ్య ఉన్న ఖాళీ స్థలాల వద్దకు సందర్శన కోసం తీసుకు వెళ్లారు. వారికి ఆ స్థలం నచ్చితే గిరిజనులు పూర్తిస్థాయిలో అక్కడికి తరలించి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி