మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

57பார்த்தது
మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సున్నంబట్టి వాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎటకారి వెంకటేష్ (38) మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్ గురువారం తెలిపారు. ద్విచక్ర వాహనం పై వస్తున్న వెంకటేష్ ను ఎదురుగా వస్తున్న ఆటో అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన వెంకటేష్ ను కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్ దవాఖానికి తీసుకెళ్లి వైద్యం అందిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி