కెసిఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటుంది

374பார்த்தது
కెసిఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటుంది
టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను బ్రస్టుపట్టిస్తున్నదని కెసిఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నదని కేంద్ర మంత్రి ప్రకాష్ జగదేకర్ అన్నారు. శుక్రవారం ఇచ్చోడ మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలే రోజులు దగ్గరపడ్డాయని విమర్శించారు. 2023లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు బాయ్ చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బిజెపి పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు.మహారాష్ట్రలో శివసేన బిజెపి కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే వ్యతిరేకమైన కాంగ్రెస్ ఎన్సీపీతో జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేనకు తగిన గుణపాఠం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.

டேக்ஸ் :