ఇచ్చోడ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా కొనసాగుతున్న పొలంబాట మట్టి రోడ్డు పనులను మండల అభివృద్ధి అధికారి లక్ష్మణ్ శుక్రవారం పరిశీలించారు. ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేసవి ఎండల తీవ్రత పెరుగుతున్నందున పని ప్రదేశంలో కూలీలు సేద తీరేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు.