రుణమాఫీ అమలుపై సంబరాలు

70பார்த்தது
రుణమాఫీ అమలుపై సంబరాలు
రుణమాఫీ అమలుపై జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు సంబరాలు చేసుకున్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదిక వద్ద సీఎం రేవంత్రెడ్డి రుణమాఫీ పథకం ప్రారంభించగానే డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు
ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు జరిపారు.

సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ అమలు చేసి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందన్నారు. రెండు, మూడు విడతల్లో పూర్తి స్థాయిలో మాఫీ జరుగుతోందన్నారు.

தொடர்புடைய செய்தி