ఎన్నికల కమిషన్ నియామవళికి అనుగుణంగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి నగేష్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయలేదని, వెంటనే ఆయన నామినేషన్ను తిరస్కరించాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి అధికారులను కోరారు. గొడం నగేష్ తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను పొందుపర్చలేదని ఆరోపించారు. అధికార యంత్రాంగం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని అన్నారు.