ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్ధులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్ తో కలిసి జిల్లా రిటర్నింగ్ అధికారి రాజర్షి షా శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. మొత్తం 23 మంది అభ్యర్థులు 42 నామినేషన్లు దాఖలు చేయగా వివిధ కారణాలతో 10 నామినేషన్లు తిరస్కరించినట్టు తెలిపారు.