లోన్‌ యాప్ నిర్వాహకుల వేధింపులకు యువకుడు బలి

57பார்த்தது
లోన్‌ యాప్ నిర్వాహకుల వేధింపులకు యువకుడు బలి
లోన్ యాప్‌ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. తెలంగాణలోని హనుమకొండ జిల్లా ముల్కనూర్‌కు చెందిన మాడుగుల అనిల్ (29) డిగ్రీ వరకు చదువుతూ ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా నిర్వహిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా లోన్ యాప్‌ల నుంచి సుమారు రూ.9 లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించాలని లోన్‌ యాప్‌ నిర్వాహకులు వేధిస్తుండడంతో పురుగుల మందు తాగాడు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

தொடர்புடைய செய்தி