రఫాపై తక్షణమే దాడులు ఆపాలని ఇజ్రాయెలు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. వెంటనే పాలస్తీనా ప్రజలకు విముక్తి కల్పించాలని సూచించింది. గాజాలో సైనిక కార్యకలాపాలను ఆపేయాలంటూ ఇజ్రాయెల్కు ఆదేశిస్తూ తీర్పును జారీ చేయడం ఇదే తొలిసారి. పాలస్తీనాపై తక్షణమే దాడులు ఆపేలా చర్యలు తీసుకోవాలంటూ దక్షిణాఫ్రికా న్యాయ ప్రతినిధులు గతవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది.