ఆక్రమిత వెస్ట్బ్యాంక్పై ఇజ్రాయెల్ భారీ స్థాయిలో విరుచుకుపడింది. జెనిన్సహా పలు నగరాల్లో సోదాలు నిర్వహించింది. డ్రోన్లు, ప్రత్యేక దళాలతో ఉగ్రవాదుల కోసం జల్లెడ పట్టింది. బుల్డోజర్లనూ రంగంలోకి దించింది. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. ఈ పరిణామాలపై స్పందించిన పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ సౌదీ అరేబియా పర్యటనను రద్దు చేసుకుని ఇంటికి వెళ్లినట్లు స్థానిక మీడియా పేర్కొంది.