రైల్వే ట్రాక్ పై 10 డిటోనేటర్లు.. ఆర్మీ సిబ్బందితో వెళ్తున్న రైలుకు తప్పిన ప్రమాదం

68பார்த்தது
రైల్వే ట్రాక్ పై 10 డిటోనేటర్లు.. ఆర్మీ సిబ్బందితో వెళ్తున్న రైలుకు తప్పిన ప్రమాదం
మధ్యప్రదేశ్ లో రైలును పేల్చివేసేందుకు మరో కుట్ర జరిగింది. సగ్ ఫటా స్టేషన్ కు సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పై కనీసం 10 డిటోనేటర్లను అధికారులు గుర్తించారు. ఆర్మీ సిబ్బందితో ప్రయాణిస్తున్న రైలును పట్టాలు తప్పించేందుకు వీటిని అమర్చినట్లు అనుమానిస్తున్నారు. రైలు డిటోనేటర్ల మీదుగా వెళ్లిందని, పేలుడు శబ్దం రావడంతో లోకో పైలట్ సరైన సమయానికి రైలును నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై ఎన్ఐఏ, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி