యువకుడి మృతదేహం లభ్యం (వీడియో)

52பார்த்தது
నంద్యాల జిల్లా మహానంది సమీపంలోని తెలుగుగంగ కాలువలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. కడప జిల్లా బద్వేల్‌కు చెందిన గౌతమ్ సెల్ఫీ వీడియో తీసుకుంటూ తెలుగుగంగ కాలువలో పడి గల్లంతయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం గాజులపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని బసవపురం వద్ద మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி