బన్సీ ఉత్సవాలను చూసేందుకు వెళ్తూ.. ఇద్దరు మృతి

81பார்த்தது
ఏపీలోని కర్నూలు జిల్లా ఆలూరు మండలం కరిడిగుడ్డం వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాలను చూసేందుకు ముగ్గురు యువకులు బైక్‌పై వెళ్తూ అదుపుతప్పి గుంతలో పడ్డారు. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆదోని ఆస్పత్రి మార్చురీకి, క్షతగాత్రుడిని ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు జరుగుతోంది.

தொடர்புடைய செய்தி