త్రిపురాంతకం: మహంకాళి రూపంలో అమ్మవారు

82பார்த்தது
త్రిపురాంతకం లోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు మహంకాళి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించి అర్చకులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని స్మరిస్తూ మహిళలు నృత్యాలు చేశారు. స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు.

தொடர்புடைய செய்தி