గృహ, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎంపికయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పేరును సిఫార్సు చేసిన నేపథ్యంలో శుక్రవారం అమరావతిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.