మార్కాపురం: సంతానలక్ష్మి రూపంలో అమ్మవారు

59பார்த்தது
మార్కాపురం: సంతానలక్ష్మి రూపంలో అమ్మవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో దసరా నవరాత్రులలో భాగంగా మంగళవారం భక్తులకు రాజరాజేశ్వరి అమ్మవారు సంతాన లక్ష్మి రూపంలో దర్శనం ఇచ్చారు. 6వ రోజు ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సంతానం లేని వారు సంతానం లక్ష్మీ దర్శించుకుని పూజలో నిర్వహిస్తే సంతానం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారని ఆలయ అర్చకులు తెలిపారు.

தொடர்புடைய செய்தி