మార్కాపురంలో: మూడు టిప్పర్ లారీలు సీజ్

69பார்த்தது
మార్కాపురంలో మూడు అక్రమ ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ లారీలను మైనింగ్ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. కర్నూలు జిల్లా ఆత్మకూరుకు వెళ్లవలసిన ఇసుకను మార్కాపురంలో అన్లోడింగ్ చేస్తుండగా అధికారులు గుర్తించారు. పట్టుబడ్డ లారీలను ఆర్టీసీ డిపో ప్రాంగణానికి అధికారులు తరలించారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ విష్ణువర్ధన్ రావు హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி